అలా చేయడం రాష్ట్రానికి అరిష్టం

జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైందవ సంప్రదాయం ప్రకారం [more]

Update: 2020-09-23 14:41 GMT

జగన్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. నంద్యాల పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. హైందవ సంప్రదాయం ప్రకారం తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనన్నారు. భార్య ఉండగా భర్త ఒక్కరే తిరుమలలో స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే రాష్ట్రానికి అరిష్టమని చంద్రబాబు అన్నారు. దీనిపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ పాలన రాష్ట్రాన్ని అన్ని రకాలుగా నాశనం చేస్తుందన్నారు.

Tags:    

Similar News