సీఎస్ కు బాబు లేఖ…విచారణ జరపండి

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కి లేఖ రాశారు. ఇళ్ల స్థలాల పేరుతో పెద్దయెత్తున అవినీత జరిగిందని తన లేఖలో [more]

Update: 2020-08-20 05:46 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని కి లేఖ రాశారు. ఇళ్ల స్థలాల పేరుతో పెద్దయెత్తున అవినీత జరిగిందని తన లేఖలో ఆరోపించారు. పేదల భూములను లాక్కోవడమే కాకుండా, పనికి రాని భూములను సేకరించడం విచారకరమని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఆవ భూముల్లో 500 కోట్ల అవినీతి జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. భూముల కొనుగోళ్లలో పెద్దయెత్తున చేతులు మారాయని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. వైసీపీ నేతలే ఇందులో ప్రధాన భాగస్వామ్యులన్నారు. దీనపై సమగ్ర విచారణ జరపాలని చంద్రబాబు కోరారు.

Tags:    

Similar News