బ్రేకింగ్ : చంద్రబాబు తరుపున లాయర్

Update: 2018-09-19 08:17 GMT

ధర్మాబాద్ కోర్టు జారీ చేసిన నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ పై రీకాల్ పిటీషన్ దాఖలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఆయన తన తరపున కోర్టుకు లాయర్ ను పంపించనున్నారు. మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు వద్ద అనుమతి లేకుండా నిరసన వ్యక్తం చేసిన కేసులో కోర్టుకు హాజరుకానందున ధర్మాబాద్ కోర్టు చంద్రబాబుకు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న చంద్రబాబు సహా కేసులో ఉన్న వారిని కోర్టు తమముందు హాజరుకావాలని చెప్పింది.

Similar News