ఢిల్లీలో బిజీబిజీగా చంద్రబాబు

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ [more]

Update: 2019-05-18 06:38 GMT

కేంద్రంలో బీజేపీయేతర ప్రభుత్వమే లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఇవాళ ఉదయం ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి కేంద్ర రాజకీయాలపై చర్చించారు. బీజేపీయేతర పార్టీల భేటీకి ఎవరెవరిని ఆహ్వానించాలనే అంశంపై రాహుల్ తో ఆయన మాట్లాడారు. సీపీఐ నేతలు సురవరం సుధాకర్ రెడ్డి, రాజా ఏపీ భవన్ వెళ్లి చంద్రబాబును కలిశారు. తర్వాత చంద్రబాబు శరద్ పవార్, శరద్ యాదవ్ లను కలవనున్నారు. మధ్యాహ్నం ఆయన ఢిల్లీ నుంచి లక్నో వెళ్లి మాయావతిని కలిసి కేంద్ర రాజకీయాలపై చర్చించనున్నారు. మొత్తంగా ఈసారి నరేంద్ర మోడీ మళ్లీ అధికారంలోకి రాకుండా బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News