మోత్కుపల్లి మరోసారి....?

Update: 2018-06-13 07:53 GMT

తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్రస్థాయిలో మరోసారి ద్వజమెత్తారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... రాజకీయాల్లో చంద్రబాబు ఒక చీడపురుగు అని, తెలుగుదేశం పార్టీని నందమూరి కుటుంబానికి అప్పగించాలని, లేకపోతే ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. చంద్రబాబు నడిపే టీడీపీ ఒక దుర్మార్గపు పార్టీ అని, ఏపీని అవినీతి ప్రదేశ్ చేశారన్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరూ ఓటుకు నోట్లు కేసులో దొరికిన దొంగలని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం జగన్ మాత్రమే పోరాడుతున్నారని, చంద్రబాబు కాదన్నారు. కాపులు, దళితులు, బ్రాహ్మణుల మధ్య చంద్రబాబు గొడవ పెడుతున్నారని, రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓటమి ఖాయమన్నారు. తిరుమల మెట్లెక్కి చంద్రబాబు ఓడిపోవాలని మొక్కుకుంటానని పేర్కొన్నారు.

Similar News