బ్రేకింగ్ : హైదరాబాద్ చేరుకున్న కేంద్ర బృందాలు

కరోనా తీవ్రత అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నగరాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కరోనా [more]

Update: 2020-04-25 04:27 GMT

కరోనా తీవ్రత అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారులు హైదరాబాద్ చేరుకున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నగరాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో పర్యటించి, అక్కడి పరిస్థితులను అథ్యయనం చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. హైదరాబాద్ లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో నమోదయిన కేసుల్లో సగం కేసులు హైదరాబాద్ లోనే ఉండటం ఆందోళన కల్గిస్తుంది. దీంతో కేంద్ర బృందం అంచనా వేయడానికి హైదరాబాద్ చేరుకుంది.

Tags:    

Similar News