సెల్ ఫోన్ కోసం దారుణం

Update: 2018-07-16 12:44 GMT

హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అదృష్యమైన విద్యార్ధి ఆదిబాట్ల లో శవమై కనిపించాడు. కేవలం నచ్చిన సేల్ ఫోన్ మిత్రుడి దగ్గర ఉందని చంపేసి పేట్రోల్ పోసి తగలబెట్టాడు మరో యువకుడు..రామంతాపూర్ లోని ఓ ప్రైవెట్ కాలేజీలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్నాడు ప్రేమ్ కుమార్. ఇంటి వద్దే నివాసం ఉండే మిత్రుడు ప్రేమ్ సాగర్ తో ప్రేమ్ కు స్నేహం ఉంది. తల్లి దండ్రులు నాటకాలు వేస్తూ, ఖాళీ సమయల్లో టైలరింగ్ చేస్తుంటారు. గత రెండు రోజుల క్రితం లాంగ్ డ్రైవ్ కు వెళదామంటూ ప్రేమ్ ను తీసుకోని వెళ్లాడు ప్రేమ్ సాగర్. ఎంతకీ ఇళ్లు చేరక పోవడంతో అనుమానం కలిగిన తండ్రి శంకర్ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

 

కేవలం సెల్ ఫోన్ కోసమే

రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించగా బస్తీ లో ప్రేమ్ అనే యువకుడి వాహనంపై వెళ్లినట్టు తెలిసింది. తమదైనశైలిలో విచారించగా తానే హత్యచేసినట్లు అంగీకరించాడు ప్రేమ్. ఆది బట్ల వద్ద హత్య చేసి..ఘట్ కేసర్ వద్ద ఓ పేట్రోల్ బంకులో పేట్రోల్ తీసుకొని మృతదేహన్ని కాల్చివేసినట్లుగా తెలపడంతో..ప్రేమ్ సాగర్ ను తీసుకోని స్పాట్ కు వెళ్లి మృతదేహన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు..గాంధీ ఆసుపత్రి కి తరలించారు. మృతదేహన్ని చూసి గుండేలు అదిరేలా రోదించారు బంధువులు..కేవలం సేల్ ఫోన్ కోసం తమ ప్రేమ్ ను హత్యచేశారని వాపోయారు కుటుంబ సభ్యులు. ఘట్ కేసర్ పేట్రోల్ బంకు వద్ద సీసీ ఫుటేజ్ ఆధారంగా పేట్రోల్ తీసుకోని కాల్చి వేశాడని నిర్ధారించిన పోలీసులు.. కిడ్నాప్,హత్య కేసుల క్రింద కేసు నమోదు చేశారు..

Similar News