బాబు మీద సీబీఐ విచారణపై బీజేపీ క్లారిటీ

Update: 2018-06-27 10:29 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై సీబీఐ విచారణ జరిపించమని బీజేపీ మహిళా మోర్చా జాతీయ ఇన్ ఛార్జి దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. కక్షతో సీబీఐ దాడులు జరిపించే సంస్కృతి బీజేపీది కాదని ఆమె పేర్కొన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ... రాష్ట్రానికి ప్రత్యేక హోదాకు మించి నిధులు ఇచ్చామని ఆమె పేర్కొన్నారు. ఇచ్చిన నిధులకు యుటిలీటీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా కేంద్రం ఎలా నిధులు మంజూరు చేస్తుందని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో ఉందన్నారు. పోలవరం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, బీజేపీ ప్రభుత్వం ఇప్పటికే రూ.1,600 కోట్లు నిధులు విడుదల చేసిందన్నారు. ఈ లెక్కలను కూడా చంద్రబాబు చెప్పడం లేదని ఆమె ఆరోపించారు.

Similar News