అత్యుత్సాహంతో కేసుల్లో ఇరుక్కున్న కోహ్లీ అభిమాని

Update: 2018-10-12 14:19 GMT

టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి భారీగా అభిమానులు ఉంటారు. ఒక్కో అభిమాని ఒక్కో రీతిలో తమ అభిమానాన్ని వ్యక్తం చేస్తారు. అయితే, కడప జిల్లాకు చెందిన మహ్మద్ ఖాన్ మాత్రం కొంత అత్యుత్సాహం ప్రదర్శించి కేసుల్లో ఇరుక్కున్నాడు. శుక్రవారం వెస్టిండీస్ తో ఉప్పల్ లో టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ జరుగుతుండగా మహ్మద్ ఖాన్ సెక్యూరిటీకి చిక్కకుండా ఏకంగా గ్రౌండ్ లోనికి ప్రవేశించాడు. తమ అభిమాన క్రికెటర్ విరాట్ కోహ్లి వద్దకు దూసుకునిపోయి కౌగలించుకుని, ముద్దు పెట్టుకుని ఆనందంతో సెల్ఫీ దిగాడు. అశ్విన్, పృధ్వీషా అతడిని నిలువరించే ప్రయత్నం చేయగా వారితోనూ సెల్ఫీలు దిగాడు. అభిమాని చర్యకు కోహ్లి ఒక్కసారి ఆశ్చర్యపోయాడు. అయితే, వెంటనే సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఉప్పల్ పోలీసులు మహ్మద్ ఖాన్ పై 351, 448, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Similar News