జేఏసీతో ఛలో ఢిల్లీ

అమరావతి రాజధాని రైతుల ఆందోళన 45వ రోజుకు చేరుకుంది. రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరు గ్రామంలో రైతులు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వెలగపూడిలో కొనసాగుతున్న దీక్షా శిబిరంలో [more]

Update: 2020-01-31 08:14 GMT

అమరావతి రాజధాని రైతుల ఆందోళన 45వ రోజుకు చేరుకుంది. రాజధాని ప్రాంతంలోని మందడం, తుళ్లూరు గ్రామంలో రైతులు మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. వెలగపూడిలో కొనసాగుతున్న దీక్షా శిబిరంలో ఒక చిన్నారికి అన్న ప్రాసన చేశారు. రాజధాని రైతులకు సీపీఐ నేతలు రామకృష్ణ, నాగేశ్వరరావులు సంఘీభావం తెలిపారు. త్వరలో జేఏసీతో కలసి అన్ని పార్టీల నేతలం ఢిల్లీ వెళతామని వారు చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షాలను కలసి ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తెలియజేస్తామన్నారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News