బాబువి పచ్చి అబద్ధాలు

చంద్రబాబు చెప్పేవన్ని పచ్చి అబద్ధాలేనని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పలు పాలు చేశారన్నారు. ప్రభుత్వం నుంచి చంద్రబాబు దిగిపోయే [more]

Update: 2019-11-21 11:54 GMT

చంద్రబాబు చెప్పేవన్ని పచ్చి అబద్ధాలేనని ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పలు పాలు చేశారన్నారు. ప్రభుత్వం నుంచి చంద్రబాబు దిగిపోయే నాటికి ఉద్యోగుల జీతాల కోసమే నలభై వేల కోట్లు పెండింగ్ లో పెట్టారన్నారు. గతంలో చంద్రబాబు ప్రశంసించిన సంస్థలకే తమ ప్రభుత్వమూ పనులను అప్పగిస్తున్నామని బుగ్గన తెలిపారు. ఒకప్పుడు ఎక్కువ ధరకు చేసిన సంస్థలే ఇప్పుడు తక్కువ ధరకు చేస్తున్నాయన్నారు. కమీషన్ల కోసమే టీడీపీ ఎక్కువ అంచనాలతో కాంట్రాక్టులను అప్పగించిందన్నారు. అమరావతి నగరం కట్టి ఉంటే లక్షల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చేదని చంద్రబాబు జనాలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తుందన్నారు. హైదరాబాద్ నగరానికి 400 ఏళ్ల చరిత్ర ఉందన్న సంగతి మర్చిపోతున్నారన్నారు.

Tags:    

Similar News