బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ -2 ఇకలేరు

స్కాట్లాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న క్వీన్ ఎలిజబెత్ ఇకలేరన్న విషయాన్ని ప్యాలెస్ వర్గాలు..

Update: 2022-09-09 03:05 GMT

బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజబెత్ 2(96) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న క్వీన్ ఎలిజబెత్.. భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రి తుదిశ్వాస విడిచారు. స్కాట్లాండ్‌లోని బాల్‌మోరల్ ప్యాలెస్‌లో చికిత్స పొందుతున్న క్వీన్ ఎలిజబెత్ ఇకలేరన్న విషయాన్ని ప్యాలెస్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. రాణి కుటుంబం కూడా ఈ మేరకు ట్వీట్ చేసింది. రాణి ఎలిజబెత్ భౌతిక కాయాన్ని శుక్రవారం బ్రిటన్ ప్యాలెస్ కు తీసుకురానున్నట్లు వెల్లడించాయి. బ్రిటన్ రాణి మరణంతో..ఆ దేశమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.

బ్రిటన్ ను 70 ఏళ్ల సుదీర్ఘకాలం పాటు పరిపాలించిన రాణిగా ఎలిజబెత్ 2 గుర్తింపు పొందారు. 1922లో జన్మించిన ఆమె.. 1947లో ప్రిన్స్ పిలిప్ మౌంట్ బాటెన్ ను పెళ్లాడారు. 22 ఏళ్ల వయస్సులోనే ఆమె బ్రిటన్ రాణిగా కిరీటాన్ని ధరించారు. బ్రిటన్ రాజకుటుంబ చరిత్రలోనే అత్యధిక కాలం రాణిగా కొనసాగారు. తన 70 ఏళ్ల సేవలకు గుర్తుగా గత జూన్ నెలలో ఆ దేశ వ్యాప్తంగా ప్లాటినం జూబ్లీ వేడుకలు కూడా నిర్వహించారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 మృతి పట్ల భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తమ సానుభూతిని ప్రకటించారు. ఈ కాలపు గొప్ప నాయకురాలిగా రాణి ఎలిజబెత్ చరిత్రలో నిలిచిపోతారని, బ్రిటన్ కు సమర్థమైన, స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని రాణి ఎలిజబెత్ అందించారని మోదీ కొనియాడారు.


Tags:    

Similar News