బోండా ఉమ నిర్ణయం…?

తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలవనున్నారు. బోండా ఉమామహేశ్వరరావు టీడీపీని వీడతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే బోండా [more]

Update: 2019-08-12 04:01 GMT

తెలుగుదేశం పార్టీ నేత బోండా ఉమామహేశ్వరరావు నేడు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని కలవనున్నారు. బోండా ఉమామహేశ్వరరావు టీడీపీని వీడతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అయితే బోండా ఉమామహేశ్వరరావు ఆస్ట్రేలియా పర్యటనలో ఉండటంతో దీనిపై ఆయన స్పందించలేదు. ఆస్ట్రేలియా పర్యటన నుంచి వచ్చిన బోండా ఉమామహేశ్వరరావును కొందరు టీడీపీ నేతలు కలసి దీనిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీలో జరుగుతున్న పరిణామాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో బోండా ఉమమహేశ్వరరావుకు చంద్రబాబునుంచి పిలుపు వచ్చింది. ఈరోజు సాయంత్రం బోండా ఉమామహేశ్వరరావు చంద్రబాబును కలవనున్నారు. ఆయనను కలసిన అనంతరం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని బోండా ఉమామహేశ్వరావు చెబుతున్నారు.

Tags:    

Similar News