రాజేంద్రకు నేను డబ్బులివ్వలేదు

టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కు తాను నగదు ఇవ్వలేదని పెనమలూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. రాజేంద్ర ప్రసాద్ కు, [more]

Update: 2019-11-16 06:35 GMT

టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ కు తాను నగదు ఇవ్వలేదని పెనమలూరు టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ స్పష్టం చేశారు. రాజేంద్ర ప్రసాద్ కు, తనకు మధ్య నగదు లావాదేవీలేవీ జరగలేదని బోడే ప్రసాద్ తెలిపారు. వల్లభనేని వంశీ ఇటీవల రాజేంద్ర ప్రసాద్ పై చేసిన ఆరోపణలను బోడే ప్రసాద్ ఖండించారు. రెండురోజుల క్రితం రాజేంద్ర ప్రసాద్ పై వల్లభనేని వంశీ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పెనమలూరులో మద్దతిచ్చేందుకు రాజేంద్రప్రసాద్ కు బోడే ప్రసాద్ డబ్బులిచ్చారని, తాను, కొనకళ్ల నారాయణ వెళ్లి ఆ డబ్బులు రాజేంద్ర ప్రసాద్ కు ఇచ్చామని వంశీ విమర్శించారు. దీనిపై బోడే ప్రసాద్ ఈరోజు స్పందించారు.

Tags:    

Similar News