కేంద్రం జోక్యం చేసుకోదు

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. రాజధాని తరలింపు అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందే తప్ప [more]

Update: 2019-12-30 03:52 GMT

రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోనిదని కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ వ్యాఖ్యానించారు. రాజధాని తరలింపు అంశాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందే తప్ప జోక్యం చేసుకోలేదని సీఎం రమేష్ అన్నారు. మరోవైపు అదే పార్టీకి చెందిన మరో ఎంపీ సుజనా చౌదరి మాత్రం కేంద్ర నాయకత్వంతో మాట్లాడిన తర్వాతనే తాను చెబుతున్నానని, రాజధానిని తరలిస్తే కేంద్ర చూస్తూ ఊరుకోదని హెచ్చరించడం విశేషం. సీఎం రమేష్, సుజనా చౌదరిలు భిన్నంగా మాట్లాడటంపై పార్టీలో చర్చ జరుగుతోంది.

Tags:    

Similar News