వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత

మధ్యప్రదేశ్ బీజీపీ మంత్రి ఉషా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా ను తరిమికొట్టాలంటే యజ్ఞం చేయడమే మంచిదని ఆమె వ్యాఖ్యానించారు. కరోనాను అంతమొంచేందుకు నాలుగు రోజుల [more]

Update: 2021-05-13 00:35 GMT

మధ్యప్రదేశ్ బీజీపీ మంత్రి ఉషా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా ను తరిమికొట్టాలంటే యజ్ఞం చేయడమే మంచిదని ఆమె వ్యాఖ్యానించారు. కరోనాను అంతమొంచేందుకు నాలుగు రోజుల పాటు యజ్ఞం చేయాలని ఆమె పిలపునిచ్చారు. పర్యావరణ శుద్ధి కోసం మన పూర్వీకులు కూడా యజ్ఞాలను నిర్వహించేవారని ఉషా ఠాకూర్ గుర్తు చేశారు. యజ్ఞాలు పర్యావరణాన్ని శుద్ధి చేయడమే కాకుండా మూడో వేవ్ నుంచి తప్పించుకోవచ్చని ఉషా ఠాకూర్ అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు మండి పడుతున్నారు.

Tags:    

Similar News