గవర్నర్ కు బీజేపీ నేతల ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను రాష్ట్ర బీజేపీ నేతలు కలిశారు. వినాయక చవితి పండగ ఆంక్షలపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల్లో [more]

Update: 2021-09-07 06:15 GMT

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను రాష్ట్ర బీజేపీ నేతలు కలిశారు. వినాయక చవితి పండగ ఆంక్షలపై వారు గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఇతర రాష్ట్రాల్లో అనుమతి ఇచ్చినా ఇక్కడ వేడుకలకు ప్రభుత్వం ఆంక్షలు పెట్టిందని బీజేపీ నేతలు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గణేష్ మండపాలకు అనుమతిచ్చిన విషయాన్ని వారు గవర్నర్ వద్ద ప్రస్తావించారు. ఏపీలోనూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు అనుమతిచ్చేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను బీజేపీ నేతలు కోరారు.

Tags:    

Similar News