టీఆర్ఎస్ కి భారీ ఊరట

Update: 2018-12-03 06:26 GMT

కాంగ్రెస్ నేత నాగం జనార్ధన్ రెడ్డికి హైకోర్టు షాకిచ్చింది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోత పథకంలో పెద్దఎత్తున అవినీతి జరుగుతోందని నాగం జనార్ధన్ రెడ్డి పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను విచారించిన హైకోర్టు ఫుల్ బెంచ్ ఈ పిటీషన్ ను కొట్టివేసింది. ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్లు ఎటువంటి ఆధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది. ఎన్నికల వేళ కోర్టు ఇచ్చిన తీర్పు టీఆర్ఎస్ కి భారీ ఊరట కానుంది.

Similar News