ఈరోజు ఎలాగైనా….?

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష జరపాల్సిందేనని, ఇందులో ఎటువంటి జాప్యం చేయవద్దని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనసభలో నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. [more]

Update: 2019-07-19 03:31 GMT

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బలపరీక్ష జరపాల్సిందేనని, ఇందులో ఎటువంటి జాప్యం చేయవద్దని కోరుతూ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనసభలో నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. నిన్న సభ వాయిదా పడటంతో శాసనసభలోనే బీజేపీ సభ్యులు నిద్రించారు. నేటి ఉదయాన్నే లేచి దైనందిన కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యేలు నేడు సభలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. యడ్యూరప్ప సయితం శాసనసభ్యలుతోనే ఉండి ఎప్పటికప్పుడు హైకమాండ్ కు పరిస్థితిని వివరిస్తున్నారు. నేటి మధ్యాహ్నంలోగా బలపరీక్ష చేసుకోవాలని గవర్నర్ ఆదేశాలతో ఈరోజు ఖచ్చితంగా బలపరీక్ష జరుగుతుందని బీజేపీ భావిస్తోంది.

Tags:    

Similar News