కేటీఆర్ కు బండి సంజయ్ లేఖ

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. [more]

Update: 2021-03-03 01:00 GMT

తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణలో ఐటీఐఆర్ ప్రాజెక్టు అమలు కాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. దీనిని కప్పి పుచ్చుకోవడానికే కేటీఆర్ రోజుకో లేఖను కేంద్ర మంత్రికి రాస్తున్నారని బండి సంజయ్ తెలిపారు. ఐటీఐఆర్ డెవెలెప్ మెంట్ అథారిటీనే ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని చెప్పారు. రైల్వ, ఎంఎంటీస్, రేడియల్ రోడ్లను అభివృద్ధి చేయకుండా ఐటీఐఆర్ ప్రాజెక్టుపై కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం పై బురద చల్లుతున్నారని బండి సంజయ్ తాను రాసిన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News