అశోక్ గజపతి రాజే కొనసాగుతారు

టీడీపీ నేత అశోక్ గజపతి రాజుకు హైకోర్టులో ఊరట లభించింది. మూడు దేవస్థానాలకు ధర్మకర్తమండలి ఛైర్మన్ గా ఆయనే కొనసాగాలని చెప్పింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన [more]

Update: 2021-01-29 01:58 GMT

టీడీపీ నేత అశోక్ గజపతి రాజుకు హైకోర్టులో ఊరట లభించింది. మూడు దేవస్థానాలకు ధర్మకర్తమండలి ఛైర్మన్ గా ఆయనే కొనసాగాలని చెప్పింది. ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. విజయనగరం జిల్లాలో రామతీర్థం ఘటనకు బాధ్యత వహిస్తూ ప్రభుత్వం అశోక్ గజపతి రాజును మూడు ఆలయాల ధర్మకర్త మండలి ఛైర్మన్ పదవి నుంచి తప్పించింది. దీనిపై అశోక్ గజపతి రాజు హైకోర్టు ను ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది.

Tags:    

Similar News