16 కేసుల్లో ఇక రోజు వారీ విచారణ

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను ఇకపై రోజువారీ విచారణ జరగనుంది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. జగన్ [more]

Update: 2020-10-10 02:10 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులను ఇకపై రోజువారీ విచారణ జరగనుంది. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. జగన్ పై సీబీఐ నమోదు చేసిన 11 కేసులతో పాటు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్నోదు చేసిన ఐదు కేసుల విచారణ ఇకపై రోజు వారీ జరుగుతుందని కోర్టు స్పష్టం చేసింది. దసరా సెలవుల అనంతరం రోజు వారీ విచారణ చేపట్టాలని జగన్ తరుపున న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఇకపై రోజు వారీ విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. అయితే ఆన్ లైన్ లో రోజు వారీ విచారణ చేపట్టాలని న్యాయవాది కోరగా దానిని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.

Tags:    

Similar News