నాకే చుక్కలు చూపిస్తున్నారు.. చంద్రబాబు అసంతృప్తి

చుక్కల భూముల విషయంలో అధికారులు తనకే చుక్కలు చూపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. [more]

Update: 2019-01-28 09:01 GMT

చుక్కల భూముల విషయంలో అధికారులు తనకే చుక్కలు చూపిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కల భూముల సమస్య అంశం చర్చకు వచ్చింది. అయితే, చుక్కల భూముల సమస్యను పరిష్కరించకపోవడం పట్ల చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాత రూల్ బుక్ పట్టుకొని ప్రజలను అధికారులు ఇబ్బంది పెడుతున్నారని, మంత్రివర్గం ఆమోదించిన కొత్త నిబంధనలను అమలు చేయాలని ఆయన ఐఏఎస్ అధికారులకు సూచించారు.

Tags:    

Similar News