రామోజీరావుపై కేసు నమోదు

ఏపీ సీఐడీ పోలీసులు మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావుపై కేసు నమోదు చేశారు

Update: 2023-03-11 14:33 GMT

ఏపీ సీఐడీ పోలీసులు మార్గదర్శి ఛైర్మన్ రామోజీరావుపై కేసు నమోదు చేశారు. రామోజీరావుతో పాటు మార్గదర్శిం ఎండీ శైలజ బ్రాంచ్ మేనేజర్లపై కూడా కేసు నమోదయింది. సెక్షన్ 120 బీ, 409, 420, 477(ఎ) రెడ్ విత్ 34 ఆఫ్ సెక్షన్ల కింద కేసు నమోదయింది. సెక్షన్ 5, ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్ ఇన్ ఫైనాన్షియర్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం కింద ఏపీ సీఐడీ పోలీసులు ఈ కేసును నమోదు చేశారు.

మార్గదర్శి అధికారుల ఇళ్లలో...
ఈరోజు ఉదయం నుంచి రాష్ట్రంలోని మార్గదర్శి అధికారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఏపీ సోదాలు నిర్వహించింది 1982 చిట్‌ఫండ్ చట్టం ప్రకారం కేసు నమోదయినట్లు మీడియాకు ప్రెస్ నోట్ ద్వారా తెలియచేశారు. విశాఖపట్నం, విజయవాడ, ఏలూరు, కాకినాడ, గుంటూరు, పల్నాడు, కర్నూలు, అనంతపురం చిట్స్ అసిస్టెంట్స్ రిజిస్ట్రార్‌లు సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ ఈ కేసు నమోదు చేసింది.
అనేక అవకతవకలు...
తమ సోదాల్లో మార్గదర్శి అధికారులు సిబ్బంది విచారణకు సహకరించలేదని పేర్కొంది. సోదాల్లో మార్గదర్శిలో అనేక అవకతవకలు, ినిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించినట్లు సీఐడీ పోలీసులు పేర్కొన్నారు. చిట్స్ కట్టే అనేక మందికి వాయిదాలను సక్రమంగా చెల్లించకపోవడం గుర్తించామని అధికారులు తెలిపారు. ఖాతాదారుల ఇచ్చే మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ ఆఫీస్ ఖాతాలకు బదిలీ చేయడం గుర్తించడం జరిగిందన్నారు. చిట్ ఫండ్ చట్టంలోని సెక్షన్ 24 రూల్ 28 ప్రకారం ఆదాయం మరియు వ్యయ ఖాతా మరియు ఆస్తులు,అప్పులు స్టేట్‌మెంట్‌తో పాటు పెట్టుబడి వివరాలను బహిర్గతం చేయలేదని సీఐడీ పోలీసులు పేర్కొన్నారు.
ఇంకా సోదాలు...
బ్రాంచ్‌ల నుండి చిట్ ఫండ్ సంస్థల నుంచి సేకరించిన మొత్తాన్ని నిబంధనలకు విరుద్ధంగా కార్పొరేట్ కార్యాలయానికి బదిలీ చేస్తున్నారన్నారు. ఈ మొత్తాలను క్యాపిటల్ మార్కెట్ రిస్క్‌లపై ఆధారపడి ఉండే మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెడుతున్నారని కనుగొన్నట్లు సీఐడీ అధికారులు తమ విచారణ నివేదికలో పేర్కొన్నారు. చిట్ వారీగా బ్యాలెన్స్ షీట్ మరియు లాభ నష్టాల స్టేట్‌మెంట్‌లు నిర్వహించడంలేదని పేర్కొన్నారు. తమ సోదాల్లో కొందరు అధికారులు సహకరించలేదని మరికొందరు పరారీలో ఉన్నారని సీఐడీ అధికారులు పేర్కొన్నారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, అనంతపురం బ్రాంచ్‌లలో జరిగిన అవకతవకలపై సిబ్బందిని విచారించి వారి స్టేట్‌మెంట్లు నమోదు చేస్తున్నారన్నారు. రికార్డులన్నింటినీ నరసరావుపేట, ఏలూరు, అంతపురం బ్రాంచ్‌లకు చెందిన ఫోర్‌మెన్‌లు పరారీలో ఉన్నారని తెలిపారు. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని సీఐడీ అధికారులు తెలిపారు.


Tags:    

Similar News