బ్రేకింగ్ : తరలించేందుకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హై పవర్ కమిటీ నివేదికను ఆమోదించింది. దాదాపు 137 పేజీలతో ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఓకే తెలిపింది. [more]

Update: 2020-01-20 04:54 GMT

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో హై పవర్ కమిటీ నివేదికను ఆమోదించింది. దాదాపు 137 పేజీలతో ఇచ్చిన నివేదికకు కేబినెట్ ఓకే తెలిపింది. రాజధాని ప్రాంతంలో రైతుల ఆందోళనకు చెక్ పెట్టడానికి రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 11వేల రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజధాని రైతులకు మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని నిర్ణయించింది. పరిపాలన, అభివృద్ధి వికేంద్రీకరణకు ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ ఉపసంహరణ బిల్లుకు కూడా కేబినెట్ ఆమోదం చెప్పింది. భూములిచ్చిన రైతులకు కౌలు చెల్లింపు పది నుంచి పదిహేనేళ్ల వరకూ పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

Tags:    

Similar News