ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీకి కొత్త ఇంఛార్జిని నియమించింది ఆ పార్టీ అధిష్ఠానం. ఆ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంఛార్జిగా మురళీధరన్, సహ ఇంఛార్జిగా సునీల్ డియోడర్ ను నియమించారు. ఏపీలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోన్న బీజేపీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోంది. సునీల్ డియోడర్ త్రిపురలో బీజేపీ గెలుపులో కీలక పాత్ర పోషించారు.