అజ్ఞాతంలోకి మరో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి..?

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా [more]

Update: 2019-03-18 07:15 GMT

తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలేలా ఉంది. ఇప్పటికే ఆ పార్టీ నెల్లూరు రూరల్ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరగా తాజాగా మరో ఎమ్మెల్యే అభ్యర్థి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. శ్రీశైలంలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన బుడ్డా రాజశేఖర్ రెడ్డి తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. ఆయన ఈ ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ ప్రకటించారు. అయితే, ఆయన ప్రచారం చేయకుండా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకొని వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. బుడ్డా సతీమణి అనారోగ్యంతో ఉన్నందున ఆయన పోటీ నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. వైసీపీ బలంగా ఉండటం వల్లే ఆయన పోటీ చేయవద్దని భావిస్తున్నారని మరో ప్రచారమూ ఉంది. బుడ్డా పోటీ నుంచి తప్పుకునే అవకాశం ఉండటంతో మరో అభ్యర్థి కోసం టీడీపీ వెతుకులాట ప్రారంభించింది. నంద్యాల టిక్కెట్ ఆశిస్తున్న ఏవీ సుబ్బారెడ్డిని శ్రీశైలం నుంచి పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు సమాచారం.

Tags:    

Similar News