విశాఖలో మరో గ్యాస్ లీక్.. ఇద్దరు మృతి.. జగన్ ఆరా

విశాఖపట్నంలో మరో గ్యాస్ లీకేజీ సంఘటన జరిగింది. ఈరోజు తెల్లవారుజామున పరవాడలోని ఫార్మాసిటీలో గ్యాస్ లీకయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్ర అస్వస్థతకు [more]

Update: 2020-06-30 02:42 GMT

విశాఖపట్నంలో మరో గ్యాస్ లీకేజీ సంఘటన జరిగింది. ఈరోజు తెల్లవారుజామున పరవాడలోని ఫార్మాసిటీలో గ్యాస్ లీకయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. హైడ్రోజన్ సల్ఫైడ్ అధికంగా లీకేజీ కావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అస్వస్థతకు గురైన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. విశాఖలో వరసగా గ్యాస్ లీక్ సంఘటనలు చోటుచేసుకుంటుడటం ఆందోళన కల్గిస్తుంది. దీనిపై ముఖ్యమంత్రి జగన్ ఆరా తీశారు. ఘటనపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

Tags:    

Similar News