కశ్మీర్ లో మరో పేలుడు

పుల్వామా ఉగ్రదాడి మరువకముందే జమ్మూ కశ్మీర్ లో మరో బాంబు పేలుడు సంభవించింది. కశ్మీర్ లోని రాజౌరి జిల్లా నౌషిరా సెక్టార్ లో భారత సరిహద్దుకు 1.5 [more]

Update: 2019-02-16 12:43 GMT

పుల్వామా ఉగ్రదాడి మరువకముందే జమ్మూ కశ్మీర్ లో మరో బాంబు పేలుడు సంభవించింది. కశ్మీర్ లోని రాజౌరి జిల్లా నౌషిరా సెక్టార్ లో భారత సరిహద్దుకు 1.5 కిలోమీటర్ల లోప ఉగ్రవాదులు ఐఈడీ బాంబును అమర్చారు. ఈ బాంబును నిర్వీర్యం చేసే క్రమంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక భారత ఆర్మీ మేజర్ అమరులయ్యారు. రెండు రోజుల క్రితమే పుల్వామాలో భారత జవాన్ల కాన్వాయ్ లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు జరిపిన ఆత్మీహుతి దాడిలో 44 భారత జవాన్లు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన నుంచి తేరుకోకముందే మరో పేలుడు సంభవించింది.

Tags:    

Similar News