మాన్సాస్ ట్రస్ట్ ఈవోపై హైకోర్టు ఆగ్రహం.. నోటీసులు జారీ

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో హైకోర్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు నోటీసులు జారీ చేసింది. తనకు సహకరించడం లేదంటూ మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటీషన్ [more]

Update: 2021-07-27 06:48 GMT

మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారంలో హైకోర్టు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కు నోటీసులు జారీ చేసింది. తనకు సహకరించడం లేదంటూ మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో మాన్సాస్ ఈవో తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. ఈవో వెంకటేశ్వరరావుకు నోటీసులు జారీ చేసింది. మాన్సాస్ ట్రస్ట్ లో ఆడిట్ ను స్టేట్ ఆడిట్ అధికారులే చేయాలని హైకోర్టు పేర్కొంది. ఇతరులు ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని హైకోర్టు పేర్కొంది.

Tags:    

Similar News