ఏపీలో అక్కడ మాత్రం మరో 28 రోజులు లాక్ డౌన్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగింపు పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన తర్వాత ఏపీ కూడా ప్రకటన చేసే అవకాశముంది. [more]

Update: 2020-04-14 03:42 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగింపు పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన తర్వాత ఏపీ కూడా ప్రకటన చేసే అవకాశముంది. అయితే ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాళహస్తి పట్టణంలో మాత్రం మరో 28 రోజులు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. శ్రీకాళహస్తి పట్టణంలో మరో 28 రోజులు లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు కలెక్టర్ నారయణ భరత్ గుప్తా ప్రకటించారు. మర్కజ్ మసీదు ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి నుంచి కరోనా వైరస్ మరో ఇద్దరికి సోకడంతో కలెక్టర్ అప్రమత్తమై శ్రీకాళహస్తిలో మరో 28 రోజులు లాక్ డౌన్ ను అమలు చేయనున్నట్లు ప్రకటించారు.

Tags:    

Similar News