చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై శాసనసభ సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశానికి అడ్డం తగులుతూ, రాజకీయం చేయాలని చంద్రబాబు [more]

Update: 2019-07-24 04:46 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడుపై శాసనసభ సమావేశాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి అంశానికి అడ్డం తగులుతూ, రాజకీయం చేయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని జగన్ ఆరోపించారు. తాము మ్యేనిఫేస్టోలో ఉంచిన ప్రతి అంశాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని జగన్ చెప్పారు. అన్నీ అమలు చేస్తే తమకు ఎక్కడ మంచి పేరు వస్తుందోనని చంద్రబాబునాయుడు దిక్కుమాలిన ఆలోచనలు చేస్తున్నారన్నారు. ప్రతి అంశాన్ని అడ్డుకునే ప్రయత్నం మానుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. సభలో చర్చ జరగాలన్న ఉద్దేశ్యం ప్రతిపక్షానికి లేదని జగన్ అన్నారు.

Tags:    

Similar News