అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా

అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 4,5 తేదీల్లో తిరుపతిలో అమిత్ షా పర్యటించాల్సి ఉంది. దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆయన హాజరు [more]

Update: 2021-03-03 00:42 GMT

అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన వాయిదా పడింది. ఈ నెల 4,5 తేదీల్లో తిరుపతిలో అమిత్ షా పర్యటించాల్సి ఉంది. దక్షిణాది రాష్ట్రాల సమావేశానికి ఆయన హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ సమావేశం వాయిదా పడింది. దీంతో పాటు ఈ నెల 5వ తేదీన తిరుపతిలో బీజేపీ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో కూడా అమిత్ షా సమావేశం కావాల్సి ఉంది. అమిత్ షా పర్యటన రద్దుతో తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిపై ఢిల్లీలోనే నేతలతో అమిత్ షా చర్చించనున్నట్లు తెలిసింది.

Tags:    

Similar News