తెలుగులో అమిత్ షా ట్వీట్..!

Update: 2018-09-24 10:45 GMT

తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంపై భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇటీవల తెలంగాణ పర్యటనకు వచ్చి టీఆర్ఎస్ పై మాటలదాడి చేసిన అమిత్ షా ఇప్పుడు మళ్లీ విమర్శలను ఎక్కుపెట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన - ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రపంచంలోనే చాలా గొప్పదని, ఇంతటి మహత్తర పథకాన్ని టీఆర్ఎస్ స్వార్థం వల్ల తెలంగాణ ప్రజలు వినియోగించుకోలేకపోతున్నారని విమర్శించారు. ఈ మేరకు ఆయన తెలుగులో ట్వీట్ చేయడం గమనార్హం.

 

Similar News