ఏపీ ప్రజలకు అమిత్ షా బహిరంగ లేఖ

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు నాయుడు అనేక యూటర్న్ లు తీసుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన [more]

Update: 2019-02-11 13:15 GMT

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే చంద్రబాబు నాయుడు అనేక యూటర్న్ లు తీసుకుంటున్నారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. చంద్రబాబుకు రాజకీయ ఓనమాలు నేర్పిన కాంగ్రెస్ లాగానే ఆయన కూడా అనేక అబద్ధాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు రక్తంలోనే కాంగ్రెస్ ఉందన్నారు. పోర్టు నిర్మాణం దుగ్గరాజపట్నం సాధ్యం కాదని, వేరే ప్రాంతాన్ని సూచించాలని కోరితే ఇప్పటివరకు ఏపీ ప్రభుత్వం స్పందించలేదని పేర్కొన్నారు. చంద్రబాబుకు ఓటమి తప్పదని జాతీయ సర్వేలు తెలిపాయని, అందుకే మహా కల్తీ కూటమిలో చేరారని ఆరోపించారు.

Tags:    

Similar News