శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటా

రాజధాని అమరావతికి శాపం చంద్రబాబు మాత్రమేనని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఐదేళ్ల పాటు చంద్రబాబు రాజధానికోసం ఏం చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. నీరుగొండ [more]

Update: 2020-01-03 04:54 GMT

రాజధాని అమరావతికి శాపం చంద్రబాబు మాత్రమేనని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఐదేళ్ల పాటు చంద్రబాబు రాజధానికోసం ఏం చేశారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. నీరుగొండ గ్రామంలో తనకు ఐదు ఎకరాలు ఉన్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని ఆళ్ల సవాల్ విసిరారు. నిజంగా భూములు తనకు ఉంటే అవి తిరిగి ఇచ్చేస్తానని ఆళ్ల చెప్పారు. తనపై టీడీపీ నేతలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. తాను రాజధాని ప్రాంతంలో భూములు ఉన్నట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. రాజధానిలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పై తమ పార్టీ నేతలు ఇప్పటికే బయటపెట్టారన్నారు. బోండా ఉమ తనకు భూములు ఉన్నట్లు నిరూపించాలని, లేకుంటే క్షమాపణ చెప్పాలని ఆళ్ల డిమాండ్ చేశారు. చంద్రబాబు ఒక సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News