‘తస్మాత్ జాగ్రత్త’ అంటున్న రోజా

ఒకప్పుడు గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్ గా సత్తా చాటిన రోజా సెల్వమణి.. తాజాగా రాజకీయాలతోనూ బిజీ అయ్యారు. వైసీపీ నుంచి నగరి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు [more]

Update: 2019-01-28 10:24 GMT

ఒకప్పుడు గ్లామర్ ఫీల్డ్ లో హీరోయిన్ గా సత్తా చాటిన రోజా సెల్వమణి.. తాజాగా రాజకీయాలతోనూ బిజీ అయ్యారు. వైసీపీ నుంచి నగరి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రజలకు చేరువగా ఉంటూనే పార్టీలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ప్రత్యర్థులను తన మాటల తూటాలతో చీల్చి చెండాడతారామె. డబ్బులు కావాలంటే టీవీ షోస్ కూడా చెయ్యాలని చెబుతున్నారు రోజా. అయితే ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో.. రాజకీయాలతో బిజీ కావాల్సిన రోజా టీవీ షోస్ తో బిజీ అవడం మాత్రం కాస్త ఆశ్చర్యంగానే ఉంది. ప్రస్తుతం టాప్ ప్లేస్ లో ఉన్న ఈటీవి జబర్దస్త్ కి జడ్జ్ గా, జీ తెలుగులో బతుకు జట్కా బండి వ్యాఖ్యాతగా, జెమినిలో రంగస్థలం డాన్స్ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఇలా టీవీ షోస్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తూ రాజకీయాలను నిర్లక్ష్యం చేస్తున్నారా అంటే.. అక్కడ కూడా బాగా యాక్టీవ్ గానే ఉంటున్నారు.

మరో షో లో కూడా…

ఇక ఎన్నికలు దగ్గర పడేకొద్దీ రాజకీయాలలో బిజీ కావాల్సి ఉంటుంది. ఇతర పనులన్నీ మానుకొని ప్రజల్లోనే ఎక్కువగా ఉండాల్సి ఉంటుంది. కానీ రోజా మాత్రం ఇప్పుడు జెమిని ఛానల్ లో మరో కొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రజలను అప్రమత్తం చేసే షో లా కనబడుతున్న ఆ షో పేరు ‘తస్మాత్ జాగ్రత్త’. సమాజంలో జరుగుతున్న దొంగతనాలు, హత్యలు, అత్యాచారాల మీద ఎమైనా ఈ షో సాగుతుందేమో.. అందుకే ఈ షోకి తస్మాత్ జాగ్రత్త అనే టైటిల్ పెట్టారు. త్వరలోనే రోజా ఆధ్వర్యంలో ఈ షో జెమిని ఛానల్ లో ప్రసారం కాబోతుంది. ఇక రోజా గతంలోనూ జెమిని ఛానల్ లో రచ్చబండ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మరి డబ్బు కోసం షోలు చేస్తుంటే… రాజకీయాలపై పూర్తి దృష్టి సారించడం కష్టమేమో ఆలోచించు రోజమ్మా…!

Tags:    

Similar News