జగన్ ఇంత మొండితనంగా ఉంటే లాభం లేదు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో వరసగా ఉద్యోగులు మరణిస్తున్నా జగన్ కు పట్టడం లేదన్నారు. [more]

Update: 2021-04-30 01:20 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో వరసగా ఉద్యోగులు మరణిస్తున్నా జగన్ కు పట్టడం లేదన్నారు. సచివాలయ ఉద్యోగులు తమకు వర్క్ ఫ్రం హోం కల్పించాలని కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నా జగన్ పట్టించుకోలేదని అచ్చెన్నాయుడు అన్నారు. కరోనాతో వరసగా ఆరుగురు ఉద్యోగులు మృతి చెందడం బాధాకరమని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. వందలాది మంది ఉద్యోగులకు కరోనా సోకేంత వరకూ జగన్ కు పట్టేదేమోనని అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News