నాటుసారా తాగి 8 మంది మృతి

ప్రకాశం జిల్లాలో కురిచేడులో విషాద సంఘటన జరిగింది. నాటుసారా తాగి ఎనిమిది మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు నేడు మృతి చెందారు. [more]

Update: 2020-07-31 03:09 GMT

ప్రకాశం జిల్లాలో కురిచేడులో విషాద సంఘటన జరిగింది. నాటుసారా తాగి ఎనిమిది మంది మృతి చెందారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఐదుగురు నేడు మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో ఎనిమిది మంది నాటుసారా తాగి చనిపోవడం కలకలం రేపింది. అయితే నాటుసారాలో శానిటైజర్ కలుపుకుని తాగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. వీళ్లంతా సంచార జాతులకు చెందిన వారిగా గుర్తించారు. మద్యం దుకాణాలు మూసివేయడంతోనే వీళ్లు నాటుసారాలో శానిటైజర్ ను కలుపుకుని తాగడం వల్లనే చనిపోయినట్లు తెలుస్తోంది. పోస్ట్ మార్టం నివేదిక అందిన తర్వాతనే అసలు విషయం తెలుస్తోంది.

Tags:    

Similar News