మర్డర్ చేసింది ఇందుకా…?

వ్యాపారి రామ్ ప్రసాద్ ని కోగంటి ఎందుకు చంపాడు..? దేనికోసం చంపాడు ?డబ్బుల కోసం అయితే చంపాల్సిన అవసరం లేదు కానీ పగ ప్రతీకారం కోసమే హత్య [more]

Update: 2019-07-24 04:56 GMT

వ్యాపారి రామ్ ప్రసాద్ ని కోగంటి ఎందుకు చంపాడు..? దేనికోసం చంపాడు ?డబ్బుల కోసం అయితే చంపాల్సిన అవసరం లేదు కానీ పగ ప్రతీకారం కోసమే హత్య చేశానని కోగంటి సత్యం చెప్పాడు. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులకు రాంప్రసాద్ కూడా చేశాడని పోలీసులకు కోగంటి తెలిపారు.

కొత్త ట్విస్ట్…..

వ్యాపారి రాంప్రసాద్ హత్య కేసులో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త ట్విస్ట్ ను చూసి పోలీసులే అవాక్కయ్యారు ..అసలు ఇలాంటి కారణంతోనే హత్య చేశారా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. తనకు డబ్బులు ఇవ్వకుండా విదేశాలకు వెళ్లేందుకు రాంప్రసాద్ ప్రయత్నిస్తుండగా హత్య చేసానని నిందితుడు కోగంటి పోలీసులకు తెలిపాడు. కోగంటి చెప్పిన కారణం పోలీసులు షాక్ కు గురి చేసింది . ఎందుకంటే శత్రువు తన ముందే ఉండాలి ..తనతో ఎప్పుడూ గొడవ పడకుండా .శత్రువు పై నిత్యం పైచేయి సాధించాలన్నది కోగంటి సత్యం లక్ష్యం ..ఆ లక్ష్యం చివరకు హంతకుడిగా మార్చింది.

లావాదేవీలే హత్యకు…..

వ్యాపారి రాంప్రసాద్ కోగంటి సత్యం ల మధ్య లావాదేవీలు ఉన్నాయి ..ఈ లావాదేవీలు చివరకు పగలు పెంచే వరకు సాగాయి.. ఇద్దరు మధ్య కొనసాగిన లావాదేవీల్లో మొత్తానికి 70 కోట్ల రూపాయల భారం బెడిసికొట్టింది అతి చివరకు పెద్దల పంచాయితీ పెట్టి 23 కోట్ల రూపాయలు రాంప్రసాద్ ఇవ్వాలని చెప్పారు. అయితే కోగంటికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా రాంప్రసాద్ ఇవ్వకుండా నానా ఇబ్బందులు పెట్టాడు ..దీనితో పాటుగా ప్రతినిత్యం కూడా పోలీసులతో కలిపి వేధింపులకు గురి చేశారు ..ప్రధానంగా విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసు కేసులు కోగంటి సత్యంపై నమోదయ్యాయి. ప్రతి నిత్యం కూడా కోగంటి సత్యం ని రాంప్రసాద్ తీవ్రస్థాయిలో వేధింపులకు గురిచేశాడు. ఇది రాంప్రసాద్ పై పగ పెంచే విధంగా తయారైంది.. రాంప్రసాద్ 23 కోట్లు ఇవ్వాల్సి ఉండగా అతని బావమరిది శ్రీనివాసులు 12 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉంది ..అయితే బావా బామ్మర్దులు ఇద్దరు డబ్బులు ఇవ్వకుండా కోగంటి సత్యంను ఇబ్బందులకు గురిచేశారు. ఇది కోగంటి సత్యం లో పగను పెంచింది.

Tags:    

Similar News