ఈనెల 24 నుంచి హైదరాబాద్ లో ఎయిర్ షో ప్రారంభం

నాలుగు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్

Update: 2022-03-14 10:51 GMT

హైదరాబాద్ లో త్వరలోనే ఎయిర్ షో ప్రారంభం కానుంది. ఈ నెల 24 నుంచి వింగ్స్ ఇండియా-2022 పేరుతో ఎయిర్ షో నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బేగంపేట ఎయిర్ పోర్టు వేదికగా జరిగే ఈ ఎయిర్ షో లో పలు దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాఫ్టర్లు నగవాసులను కనువిందు చేయనున్నాయి. కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం మళ్లీ ఎయిర్ షో ను నిర్వహిస్తున్నారు.

నాలుగు రోజులపాటు సాగే ఈ ప్రదర్శనలో 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని అధికారుల అంచనా. ఈ ప్రదర్శనలను వీక్షించాలనుకునే వారు వింగ్స్ ఇండియా అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించామని అధికారులు తెలిపారు. తొలి మూడురోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు.




Tags:    

Similar News