వారం క్రితమే పెళ్లి.. రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి

నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వారంరోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.

Update: 2022-01-02 04:52 GMT

నల్గొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వారంరోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఎస్సై రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతనితో పాటు తండ్రి కూడా మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రంగారెడ్డి జిల్లా మాన్య తండాకు చెందిన శ్రీను నాయక్ వికారాబాద్ వన్ టౌన్ ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నాడు. 2021, డిసెంబర్ 26వతేదీన శ్రీను నాయక్ కు వివాహమయింది.

ఆర్టీసీ బస్సు - ఆటో ఢీ
తన స్వగ్రామంలో ఒడిబియ్యం కార్యక్రమాన్ని ముగించుకుని, తండ్రితో కలిసి ఆటోలో హైదరాబాద్ కు తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో చింతపల్లి మండలం మాల్ దగ్గర దేవరకొండ డిపో ఆర్టీసీ బస్సు.. ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీను నాయక్ తో పాటు అతని తండ్రి మాన్య నాయక్ కూడా మృతి చెందాడు. తండ్రి, కొడుకుల ఆకస్మిక మరణంతో పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.


Tags:    

Similar News