సెప్టంబరు 17న విమోచన దినాన్ని నిర్వహిస్తాం

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

Update: 2022-09-03 06:05 GMT

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఆజాదీ అమృతోత్సవంలో భాగంగా ఈ నెల 17వ తేదీన కేంద్ర ప్రభుత్వం అధికారికంగా విమోచన దినాన్ని నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కూడా ఈ విషయం పై లేఖలు రాస్తామని చెప్పారు. మూడు ప్రభుత్వాలు ఈ కార్యక్రమానికి సహకరించాలని కోరాయి. మూడు రాష్ట్రాల సమన్వయంతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

పరేడ్ గ్రౌండ్స్ లో.....
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సాంస్కృతిక శా‌ఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. సెప్టంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి అమిత్ షా తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు హాజరవుతారని బీజేపీ నేతలు చెబుతున్నారు.


Tags:    

Similar News