నేడు వరంగల్‌లో బీజేపీ యాత్ర

నేడు వరంగల్‌లో నిరుద్యోగ యాత్రను బీజేపీ నిర్వహిస్తుంది. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ నిరసిస్తూ ఈ ర్యాలీని నిర్వహిస్తుంది

Update: 2023-04-15 04:09 GMT

నేడు వరంగల్‌లో నిరుద్యోగ యాత్ర భారతీయ జనతాపార్టీ నిర్వహిస్తుంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఈ ర్యాలీని బీజేపీ నిర్వహిస్తుంది. టీఎస్‌పీఎస్సీ‌లో పేపర్ లీకేజీ అంశాన్ని సిట్టింగ్ జడ్జి చేత కాని సీబీఐ చేత కాని విచారణ జరిపించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. మంత్రి కేటీఆర్‌ను కేబినెట్ నుంచి బర్త్‌రఫ్ చేయాలని కూడా కోరుతూ ఈ నిరుద్యోగయ యాత్రను చేపడుతుంది.

నిరుద్యోగ యాత్ర...
అయితే ఈ నిరుద్యోగ యాత్రకు పోలీసులు పదిహేడు షరతులతో అనుమతి మంజూరు చేశారు. ఈ యాత్రకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌లు హాజరుకానుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ ర్యాలీ జరగనుంది. పోలీసులు ఈ సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర సాగనున్న ఈర్యాలీలో పెద్దయెత్తున బీజేపీ శ్రేణులు పాల్గొంటున్నాయి.


Tags:    

Similar News