రూట్ మ్యాప్ కోసం రేవంత్ రెడ్డి
జిల్లా పార్టీ అధ్యక్షులతో నేడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు
జిల్లా పార్టీ అధ్యక్షులతో నేడు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. పార్టీ కార్యక్రమాలను మరింత విస్తృతపర్చేందుకు ఈ సమావేశంలో కార్యాచరణను సిద్ధం చేయనున్నారు. తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతుంది. వివిధ సమస్యలపై ఇప్పటికే మిగిలిన పార్టీలు ఉద్యమిస్తున్నాయి. బీజేపీ అయితే కొంత దూకుడుతో ఉంది.
డీసీసీ అధ్యక్షులతో....
ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడంపై రేవంత్ రెడ్డి డీసీసీ అధ్యక్షులతో సమావేశం కానున్నారు. రాష్ట్ర స్థాయి సమస్యలతో పాటు జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి సమస్యలను గుర్తించి వాటిపై ఆందోళన చేసేందుకు ఈ సమావేశంలో రూట్ మ్యాప్ ను ఖరారు చేయనున్నారు.