Telangana : తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్...304 కోట్లు విడుదల
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీలేని రుణాలను రేపు పంపిణీ చేయనుంది
తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వడ్డీలేని రుణాలను రేపు పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ 304 కోట్ల రూపాయలను విడుదల చేసింది.కలెక్టర్లతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపరు. పంపిణీ కార్యక్రమంలో జిల్లా, మండల సమాఖ్య సభ్యులందరూ హాజరయ్యేలా చూసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు.
వడ్డీ లేని రుణాలను...
ఈ వడ్డీ లేని రుణాల పంపిణీలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులందరూ పాల్గొనాలని మల్లు భట్టి విక్రమార్క కోరారు. రేపు ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీలేని రుణాలను పంపిణీ చేయాలని, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో పంపిణీ జరగాలని మల్లు భట్టి విక్రమార్క కోరారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సూచించారు.