నడిరోడ్డుపై ప్రజాస్వామ్యం ఖూనీ.. ఇదిగో ఆధారం

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2021-11-24 07:57 GMT

తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరం నడిబొడ్డున ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని ఆయన ట్వీట్ చేశారు. రాష్ట్ర ఎంపీటీసీల సంఘం అధ్యక్షురాలి నామినేషన్ పత్రాలను టీఆర్ఎస్ గూండాలు చించివేస్తున్నా పోలీసుల పట్టించుకోలేదన్నారు రేవంత్ రెడ్డి.

కేసీఆర్ కు బానిసలా?
ఎవరికీ రక్షణ లేకుండా పోయిందన్నారు. నామినేషన్ పత్రాలను వారు చించివేస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిించారన్నారు. పోలీసులు రక్షక భటులా? కేసీఆర్ కు బానిసలా? ఇక్కడ అమలయ్యేది భారత రాజ్యాంగమా? కల్వకుంట్ల రాజ్యాంగమా? అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.


Tags:    

Similar News