నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళతారని తెలిసింది

Update: 2022-07-25 06:12 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళతారని తెలిసింది. కేసీఆర్ తో పాటు మంత్రులు కూడా కొందరు ఢిల్లీకి వెళుతున్నారు. ప్రధానంగా కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కేసీఆర్ అభినందనలు చెబుతారని తెలిసింది. దీంతో పాటు పార్టీ కార్యాలయం నిర్మాణ పనులను కూడా కేసీఆర్ పరిశీలిస్తారని సమాచారం. త్వరగా ఢిల్లీలో పార్టీ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలన్న ఉద్దేశ్యంలో కేసీఆర్ ఉన్నారు.

మూడు రోజలు పాటు...
కేసీఆర్ ఢిల్లీ పర్యటన రెండు మూడు రోజులు సాగే అవకాశముంది. ఈ రెండు మూడు రోజుల్లో కేంద్ర మంత్రులను కలసి రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే మంత్రులను వెంటబెట్టుకుని వెళుతున్నారని చెబుతున్నారు. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని భావిస్తున్న కేసీఆర్ కొందరు జాతీయ నేతలను కూడా కలిసే అవకాశముందని తెలిసింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలపై కూడా చర్చించనున్నారని సమాచారం.


Tags:    

Similar News