CM KCR: కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం.. వ్యక్తి అరెస్ట్‌

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్‌ఎస్‌ మరింత దూకుడు పెంచింది.

Update: 2023-11-17 01:44 GMT

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్‌ఎస్‌ మరింత దూకుడు పెంచింది. వరుసగా బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటూ గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు సీఎం కేసీఆర్‌. సామెతలతో సెటైర్లు.. ప్రత్యర్థులపై మాటల తూటాలు.. విమర్శలు, కాస్త సెంటిమెంట్‌ను జోడిస్తూనే జాతీయ పార్టీల తీరును కేసీఆర్‌ ఎండగడుతున్నారు. నిన్న ఆదిలాబాద్‌, బోథ్‌, నిజామాబాద్‌ రూరల్‌, నర్సాపూర్‌ సభల్లో పాల్గొని మాట్లాడారు. ప్రతీ సభలోనూ బీఆర్‌ఎస్ హాయాంలో జరిగిన అభివృద్ధిని వివరిస్తూనే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు కేసీఆర్‌.

కేసీఆర్ సభలో బుల్లెట్ల కలకలం..

ఇదిలా ఉండగా, మెదక్ జిల్లా, నర్సాపూర్ సీఎం కేసీఆర్ సభలో బుల్లెట్లు కలకలం రేపాయి. సభ ప్రగణంలోకి వచ్చిన అస్లాం అనే వ్యక్తి నుంచి రెండు బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రాయికోడ్ చెందిన అస్లాం అనే యువకుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు. బుల్లెట్ స్వాధీనం విషయాన్ని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని దృవీకరించారు. బుల్లెట్లు ఎందుకు ఉన్నాయన్న దానిపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Tags:    

Similar News