Telangana : తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర వేడుకలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Update: 2025-01-26 04:03 GMT

రెండు తెలుగు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్లు ఈ గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణలోని పరేడ్ గ్రౌండ్స్ లో జాతీయ జెండాను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రదేవ్ంత రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఆంధ్రప్రదేశ్ లో...
విజయవాడలో జరిగన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయి జాతీయ జెండాను ఆవిష్కరించారు. గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తో పాటు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.


Tags:    

Similar News